తమిళ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందట.
అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న విశాల్.. తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పెళ్లి గురించి మాట్లాడారు. తనపై వచ్చే రూమర్స్ గురించి తాను పట్టించుకోనన్నాడు. కానీ.. మళయాళ నటి లక్ష్మీ మేనన్ ను పెళ్లి చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తలపై ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
ఈ విషయంలో తాను స్పందించకపోతే ఆమె వ్యక్తిగత జీవితం ప్రభావితమవుతుందని అన్నారు. మొత్తం నా 19 ఏళ్ల కెరీర్ లో ఇప్పటివరకు 12 మందిని పెళ్లి చేసుకున్నట్టు వార్తలు రాశారని విశాల్ తెలిపాడు.