తెలుగు
te తెలుగు en English
సినిమా

Sai Pallavi: ఇన్నాళ్లు సహించా.. ఇకపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా..! సాయిపల్లవి స్ట్రాంగ్ వార్నింగ్!

‘అమరన్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో సీతగా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. నితేశ్‌ తివారీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. రాముడిగా రణ్‌బీర్‌ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా కోసం సాయి పల్లవి తన అలవాట్లను మార్చుకున్నారంటూ వస్తోన్న వార్తలపై తాజాగా ఆమె ఘాటుగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన పోస్ట్‌లు పెడితే లీగల్‌ యాక్షన్‌ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇకపై సహించను!

ఈ సినిమా కోసం సాయిపల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్‌లో ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని, హోటల్స్‌లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారని ఆ వార్తల సారాంశం. దీనిపై సాయిపల్లవి తాజాగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన రూమర్స్‌ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్‌ యాక్షన్‌ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ‘నాపై ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారీ నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే నిజమేంటనేది దేవుడికి తెలుసు. కానీ, మౌనంగా ఉంటున్నానని ఇలాంటి రూమర్స్‌ తెగ రాసేస్తున్నారు. ఇప్పుడు ప్రతిస్పందించాల్సిన సమయం వచ్చింది. నా సినిమాల విడుదల, నా ప్రకటనలు, నా కెరీర్‌.. ఇలా నాకు సంబంధించి ఏవైనా నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే.. అది గుర్తింపు పొందిన మీడియా అయినా నేను చట్టబద్దమైన యాక్షన్‌ తీసుకుంటాను. ఇన్నాళ్లు సహించాను. ఇకపై ఇలాంటి చెత్త కథనాలను మోసుకెళ్లడానికి నేను సిద్ధంగా లేను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button