ఆంధ్రప్రదేశ్
AP Cabinet: కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసిన ఏపీ కేబినెట్!
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితతో పాటు ఇతర శాఖల మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సమీకృత పర్యాటక పాలసీ 2024-29, స్పోర్ట్స్ పాలసీ-2024-29లో మార్పులతో సహా కీలక నిర్ణయాలు తీసుకుంది.
మంత్రివర్గ నిర్ణయాలివే!
- పీఎం ఆవాస్ యోజన గిరిజిన గృహ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దు
- ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం
- పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబరు 15)ని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహణకు ఆమోదం
- ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు ఆమోదం
- ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదం
- ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం
- పులివెందుల, ఉద్దానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులను ఆమోదం.