తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

New Liquor Policy: ఏపీలో నూతన మద్యం పాలసీ.. గంట గంటకు మారుతున్న అంకెలు!

ఏపీలో నూతన మద్యం పాలసీకి కనీవినీ ఎరుగుని రీతితో స్పందన వస్తోంది. మద్యం షాపుల కోసం దరఖాస్తుల ప్రవాహం ముంచెత్తుతోంది. గంటగంటకీ అంకె మారిపోతోంది. దరఖాస్తుల రూపంలో ప్రభుత్వ ఖజానా నిండుతోంది. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున ఆదాయం ఖజానాకొచ్చి చేరుతోంది. రెండ్రోజులు గడువు పెంచి అక్టోబరు 11 వరకు అవకాశం ఇవ్వటంతో.. మద్యం షాపులకు టెండర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. టెండర్లకు తటపటాయిస్తున్నవారు కూడా గడువుపెంపు ప్రకటన తర్వాత సై అంటూ ముందుకొచ్చారు. నేరుగా దరఖాస్తులు సమర్పించడం ఇబ్బందనుకున్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. శుక్రవారం సాయంత్రం 7 గంటలదాకా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్ 12, 13 తేదీల్లో దరఖాస్తులు పరిశీలించి.. 14న కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీ తీసి మద్యం షాపులు కేటాయిస్తారు. అక్టోబరు 16వ నుంచి కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏపీలో ప్రైవేటు మద్యం షాపులు నడవనున్నాయి.

ఇవాళే ఆఖరు

2019లో వైసీపీ అధికారంలోకొచ్చాక ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది. ఏపీలో అధికారం మారాక కూటమి ప్రభుత్వం మద్యం పాలసీకి సంబంధించిన జీవోను సవరించి తెలంగాణ తరహాలో విధానాన్నే అమల్లోకి తీసుకొస్తోంది. ముందు నిర్ణయించిన గడువులోపు దరఖాస్తులు అంతగా రాకపోవడం, సిండికేట్లపై కొన్ని ఆరోపణలు రావటంతో దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో మరో రోజు గడువు మిగిలి ఉండగానే దాదాపు 70వేలకి పైగా దరఖాస్తులు అందాయి. దుకాణాల లైసెన్సుల కోసం గురువారం రాత్రి 8 గంటల వరకూ 65,629 అప్లికేషన్స్ అందాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 7,920 అప్లికేషన్స్ వచ్చాయి. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో సర్కారుకు రూ.1,312.58 కోట్ల ఆదాయం సమకూరింది. శుక్రవారం చివరి రోజు కావటంతో 20 వేలకు పైగా అప్లికేషన్స్ వస్తాయని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం దరఖాస్తుల సంఖ్య 80 వేలు దాటే ఛాన్సులు ఉన్నాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button