తెలుగు
te తెలుగు en English
Linkin Bioతెలంగాణ

Group 1: తెలంగాణలో గ్రూప్-1 వివాదం ఏంటి? అసలు జీవో 55, జీవో 29 ఏం చెబుతున్నాయి?

తెలంగాణలో గ్రూప్-1 వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరీక్షను వాయిదా వేయాలని చివరి నిమిషం దాకా పోరాడిన అభ్యర్థులు ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చివరకు చేసేదేం లేక అభ్యర్థులే వెనక్కి తగ్గారు. నిన్నటి నుంచి మెయిన్స్ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. అసలు గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు ఎందుకు కోరారు. దీనిపై ఇంత వివాదం ఎందుకు నడిచింది? జీవో 29, జీవో 55 ఏం చెబుతోంది? ఇంతకూ జీవో 29 వర్సస్‌ 55 వివాదం ఏంటి..? ఏ జీవోలో ఏముంది?

2024లో జీవో 29 తెచ్చిన రేవంత్‌ ప్రభుత్వం

కేసీఆర్‌ ప్రభుత్వం 2022లో జారీ చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను కోర్టు తీర్పుతో 2024 రద్దు చేసింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. ఆ సమయంలో కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ..జీవో 29ను తీసుకువచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో 55లో 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో 40 శాతం అభ్యర్థులను మెరిట్‌ ప్రకారం ఎంపిక చేస్తే.. 60 శాతం అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లను వర్తింపు చేస్తారు. దీంతో మెరిట్‌ ఉన్న రిజర్వుడు అభ్యర్థులు ఓపెన్‌ కోటాలో ఎంపికవుతారు. మెరిట్‌ తక్కువ ఉన్న అభ్యర్థులకు..రిజర్వుడు కేటగిరిలో అవకాశం లభిస్తోంది. దీనివల్ల అటు ఓపెన్‌ కోటాలోనూ..ఇటూ రిజర్వుడు కోటాలో కూడా రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుంది.

జీవో 29తో అవకాశాలు కోల్పోతామంటున్న రిజర్వుడు అభ్యర్థులు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ప్రకారం..రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్‌లో మెరిట్‌ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఉద్యోగాల కేటాయింపులోనే రిజర్వేషన్లు వర్తింపు జేస్తారు. అందువల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వుడు అభ్యర్థులను కూడా రిజర్వేషన్ కేటగిరీ కిందనే పరిగణిస్తున్నారు. దీనివల్ల రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నవారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని అభ్యర్థుల వాదన. రిజర్వుడ్ అభ్యర్థులకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందని ఆరోపిస్తున్నారు అభ్యర్థులు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button