Rajamouli: జపాన్లో భూకంపం.. రాజమౌళి కుటుంబానికి తప్పిన ప్రమాదం
పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ కుటుంబానికి జపాన్లో ప్రమాదం తప్పింది. తాను డైరెక్ట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను అక్కడి ప్రేక్షకులతో కలిసి చూసేందుకు వెళ్లిన రాజమౌళి కుటుంబం భూకంపం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ మేరకు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.
Read also: Dhanush: ఇళయరాజా బయోపిక్… హీరోగా ధనుష్
జపాన్లో ఒక భారీ బిల్డింగ్ 28వ ఫ్లోర్లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నటుగా అనిపించిందని కార్తికేయ తెలిపాడు. కానీ కొంత సమయం తర్వాత అది భూకంపం వల్ల అలా జరిగినట్లు తెలిసి చాలా భయపడ్డానని ఆయన రాసుకొచ్చాడు. మొదటిసారిగా భూకంపం ద్వారా కలిగే అనుభూతిని చెందానని ఆయన తెలిపాడు. ఈ మేరకు భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్లో వచ్చిన వార్నింగ్ని ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో రాజమౌళి అభిమానులు వారి కుటుంబం సురక్షితంగా ఇండియాకు తిరిగి రావాలని పోస్టులు పెడుుతున్నారు. అయితే, ఈ భూకంపం తీవ్రత 5.3గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.