YS Sharmila: సీఎం కేసీఆర్కు షర్మిల అదిరిపోయే గిఫ్ట్.. ఏంటో తెలుసా?
రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు చరమగీతం చెప్పే సమయం ఆసన్నమైందని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆమె సీఎం కేసీఆర్కు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు ‘బై బై కేసీఆర్’ అని చెబుతున్నారని రాసి ఉన్న ఓ సూట్ కేసును కేసీఆర్కు బహుమతిగా ఇస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసింటే కాంగ్రెస్ను సులభంగా ఓడించేదని, కానీ తమ ఉద్దేశం కేసీఆర్ను అధికారంలో నుంచి దింపడమేనని వ్యాఖ్యానించారు. దీంతోనే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు.
ALSO READ: ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం.. రేపు వైన్స్ షాపులు బంద్
ప్రజల తీర్పును అంగీకరించాల్సిందే..
రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి, అక్రమ, నియంతృత్వ పాలనతో ప్రజలను దోచుకున్నారని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కావాలని షర్మిల ఆకాంక్షించారు. కేసీఆర్కు తెలంగాణ ప్రజలు రెండు సార్లు అధికారం ఇచ్చినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా తాను పాదయాత్ర చేసినా రాని గుర్తింపు రాహుల్ గాంధీ పాదయాత్రకు వచ్చిందని చెప్పారు. తనతో పోరాటం చేసిన వాళ్లు, తన పార్టీని వదిలి బీఆర్ఎస్లో చేరడం బాధేసిందని విచారం వ్యక్తం చేశారు. గత 2 ఎన్నికల్లోనూ కేసీఆర్ 45 మంది ప్రజా ప్రతినిధులను కొన్నారని, ఈసారి ప్రజల తీర్పును బీఆర్ఎస్ నేతలు అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు.