Siddipet: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: హరీశ్ రావు
చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. విద్యతోపాటు క్రీడల్లో పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. చదవుతోపాటు ఆటల్లో ప్రతిభ చూపించినవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. సిద్దిపేట ఫుట్బాల్ స్టేడియంలో ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించారు. అన్ని జాతీయ స్థాయి ఆటలకు సిద్దిపేట వేదికగా నిలిచిందన్నారు. పాఠశాలల స్థాయికే పరిమితమైన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు పంపేల సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
Also Read: ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ: భట్టి విక్రమార్క
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 16 రకాల క్రీడలకు సంబంధించిన మైదానాలు, కోర్టులు, సౌకర్యాలను ఏర్పాటు చేశామని, దీంతో అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు అతిథ్యం ఇచ్చామన్నారు. స్విమ్మింగ్ ఫుల్ జాతీయ స్థాయిలో పోటీలకు, బ్యాడ్మింటన్, వాలిబాల్ రాష్ట్ర జాతీయ స్థాయి సెలెక్షన్స్, ఫుట్బాల్ సెలెక్షన్స్, రంగనాయక సాగర్ వద్ద జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు సిద్దిపేట వేదికయిందని చెప్పారు.