![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/200124beer-grl-sr1.jpg)
SA20 League: టీ20 మ్యాచ్ లైవ్లో బీర్ తాగిన యువతి.. వీడియో వైరల్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. న్యూలాండ్స్ స్టేడియంలో ఎంఐ కేప్టౌన్, పార్ల్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన లీగ్ దశ మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఈ క్రికెట్ లీగ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న ఒక మహిళ బీరు గ్లాసుతో కెమెరా కంట పడింది. దీంతో పెద్ద స్క్రీన్ మీద ఆమెను చూపించారు. వెంటనే గ్రహించిన ఆమె.. ఎలాంటి మొహమాటం పడకుండా బీరు గ్లాస్ దించకుండా తాగేసింది. ఆ తర్వాత తన పక్కనున్న వ్యక్తి చేతిలోని బీర్ను తీసేసుకొని మళ్లీ క్షణాల్లో తాగేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ: ఐపీఎల్ కి కొత్త స్పాన్సర్… బీసీసీఐకి ఏడాదికి 500 కోట్ల ఆదాయం
యూఎస్ ఓపెన్లో ఇలానే..
సరిగ్గా మూడేళ్ల క్రితం యూఎస్ ఓపెన్లో ఇలాగే చేసి బీర్ గర్ల్గా ఒక అమ్మాయి ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఈమె వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్కు దిగిన పార్ల్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. తర్వాత ఎంఐ కేప్టౌన్ 16.5 ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోయి 175 పరుగులు చేసి విజయం సాధించింది. ఇందులో ఓపెనర్ రియన్ రికెల్టన్(91) అర్ధ శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్ రసీ వాన్ డస్సెన్(41) దంచి కొట్టాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పార్ల్ రాయల్స్ (13) మొదటి స్థానంలో, ఎంఐ కేప్టౌన్ (9) మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.