![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/tamilisai.jpg)
తెలంగాణ
Governor Tamilisai: దేశవ్యాప్తంగా స్వచ్ఛ్ మందిర్ అభియాన్.. ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ఇవాళ ఉదయం ఖైరతాబాద్ హనుమాన్ ఆలయనాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం.. ప్రధాని మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ్ మందిర్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. దేశ సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజల బాగుకోసం భగవంతుడిని ప్రార్థించినట్లు తమిళి సై చెప్పారు.
Also read: KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్.. ప్రజలకు కీలక సూచన
జనవరి 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆలయాలను శుభ్రం చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆలయాలను శుభ్రం చేస్తున్నారు.