![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/బండి.jpg)
BJP: పార్లమెంట్ ఎన్నికలకు సిద్దమవుతున్న బీజేపీ… ఈనెల 28న తెలంగాణకు అమిత్ షా రాక
పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పూరిస్తారన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రజలకు చాలా క్లియర్గా వివరిస్తామని ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఫిబ్రవరి 5 నుంచి యాత్ర ఉంటుందని తెలిపారు.
Also Read: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం… కొత్తగా బాధ్యతలు చేపట్టింది వీరే!
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న అమిత్ షా మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 50 నిమిషాల నుంచి 2 గంటల 40 నిమిషాల వరకు మహబూబ్నగర్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ వెళ్తారు. అక్కడ బీజేపీ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.