![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/వైఎస్.jpeg)
YS Sharmila: విభజన హామీలు… ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు: వైఎస్ షర్మిల
ఏపీ విభజన హామీల అమలు 5.5 కోట్ల ప్రజల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా వీటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. కేంద్రానికి విభజన హామీలను గుర్తు చేస్తూ పోరాటం సాగించాలని చెప్పారు. ఈ మేరకు ఆమె సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులకు బహిరంగ లేఖ రాశారు.
Also Read: బీజేపీకి మరో ముఖ్యనేత రాజీనామా… ఆ పార్టీ చీఫ్ పై తీవ్ర విమర్శలు
విభజన హామీలపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని లేఖలో ఆమె సూచించారు.హామీలపై అసెంబ్లీ లో “ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు” తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని ఈ లేఖ తెలిపారు. తన లేఖలో తమ డిమాండ్లను మీ ముందుంచామని చెప్పారు. తమ తమ పార్టీల తరపున అసెంబ్లీ వేదికగా చర్చించాలని కోరారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరం చేయాల్సిన పోరు అని సూచించారు.