![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/india-f-11_V_jpg-816x480-4g-780x470.webp)
క్రికెట్
IND vs ENG: నల్ల రిబ్బన్తో మైదానంలోకి అడుగుపెట్టిన భారత జట్టు
ఇంగ్లండ్తో రాజ్కోట్లో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు నల్ల బ్యాడ్జిలతో కనిపించారు. భారత క్రికెటర్లు మూడో రోజు చేతికి నల్ల రిబ్బన్తో మైదానంలోకి దిగారు. కాగా, ఇటీవల మాజీ కెప్టెన్ దత్తాజీరవు గైక్వాడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గౌరవార్థం రోహిత్ సేన నల్ల బ్యాడ్జిలు ధరించింది.
ALSO READ: భారత్తో మూడో టెస్ట్.. సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
కెప్టెన్గా అవకాశం..
1959 ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన దత్తాజీరావు భారత్ కెప్టెన్గా నాయకత్వం వహించారు. దత్తాజీరావు కేవలం 11 టెస్టులు మాత్రమే ఆడారు. అంతకుముందు 1957-58 సీజన్లో బరోడాను చాంపియన్గా నిలపడంతో ఆయనకు భారత్ క్రికెట్ బోర్డు కెప్టెన్గా అవకాశం కల్పించింది.