![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/GHU6hVdbIAAbryA-780x470.jpg)
క్రికెట్
Nepal vs Namibia: 33 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ.. టీ20ల్లో రికార్డు
టీ20 క్రికెట్లో మరో కొత్త రికార్డు నమోదైంది. నేపాల్తో జరిగిన టీ20 మ్యాచ్లో నమీబియా ఆటగాడు చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో జాన్ నికొల్ లొఫ్టీ ఈటన్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. కేవలం 33 బంతుల్లో 11ఫోర్లు, 8 సిక్సర్లు 101 పరుగులు చేశాడు.
ALSO READ: ఐపీఎల్లోనూ కోహ్లి ఆడకపోవచ్చు.. మాజీ క్రికెటర్
కుశాల్ రికార్డు బ్రేక్..
అంతకుముందు నేపాల్ క్రికెటర్ కుశాల్ మల్లా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మంగోలియాపై కుశాల్ 34 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజాగా, జాన్ నికొల్ 33 బంతుల్లో సెంచరీ చేయడంతో నమీబియా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కాగా, రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్లు 35 బంతుల్లో సెంచరీ చేశారు.