![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-5.47.56-PM.jpeg)
Jarkhand: జైలు నుంచి ఝార్ఖండ్ మాజీ సీఎం విడుదల
ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆరు నెలల క్రితం భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ అరెస్ట్ అయ్యారు. బరియాతులో 8.86 ఎకరాల భూమి రికార్డులను తారుమారు చేసి, నకిలీ పత్రాలతో రూ. కోట్ల విలువైన భూమిని అక్రమంగా సంపాదించారనే ఆరోపణలపై ఈడీ జనవరి 31న సోరెన్ను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. కాగా, సోరెన్ రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే.
హేమంత్ సోరెన్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఆయన భార్య కల్పనా సోరెన్ స్వాగతించారు. ఎన్నో నెలల తర్వాత సంతోషకరమైన రోజు ఎదురైందని హర్షం వ్యక్తం చేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు. మరోవైపు హేమంత్ సోరెన్కు బెయిల్ లభించడంపై కాంగ్రెస్ నేత అంబా ప్రసాద్ స్పందిస్తూ సోరెన్ అమాయకుడని తమకు తెలుసని, ఆయన రాక తమ బృందానికి మరింత బలం ఇస్తుందని చెప్పారు. ప్రతికూల పరిస్ధితుల్లోనూ జార్ఖండ్ ప్రభుత్వం నిబ్బరంతో పనిచేసిందని పేర్కొన్నారు. జార్ఖండ్ ముఖ్యంమత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Socoro Mihola