![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/kcr_2-780x470.jpg)
KCR: బీఆర్ఎస్ను కలవరపెడుతున్న ఫిరాయింపులు.. కేసీఆర్ కీలక సమావేశం
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆ పార్టీని వీడారు. దీంతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.
ALSO READ: జైలు నుంచి ఝార్ఖండ్ మాజీ సీఎం విడుదల
ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్పుపై ఆయన మండిపడ్డారు. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్లినవ్యక్తి జగిత్యాల ఎమ్మెల్యే అంటూ ఆయన పేర్కొన్నారు. 2001లో పార్టీ పెట్టినప్పుడు సంజయ్ లేడని.. మధ్యలో పార్టీలోకి వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారన్నారు. వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. మీలో నుంచే ఓ మంచి నాయకుడిని తయారు చేస్తానని.. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు.