తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Director Krish: రాడిసన్‌ డ్రగ్స్‌ కేసు.. దర్శకుడు క్రిష్‌కు నెగిటివ్‌!

రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ కేసులో సినీ దర్శకుడు క్రిష్‌కు ఊరట లభించింది. విచారణలో భాగంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో యూరిన్, రక్త పరీక్షలు నిర్వహించగా.. యూరిన్ పరీక్షలో నెగిటివ్‌ వచ్చింది. రెండ్రోజుల్లో రక్త పరీక్షల రిపోర్టులు కూడా వస్తాయని తెలిపారు. దీంతో పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. కాగా, కోర్టు అనుమతితో పోలీసులు క్రిష్‌తో పాటు చరణ్‌ల నుంచి రక్తనమూనాలు సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌కు పంపించారు. మిగతతా రిపోర్టు వచ్చిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

ALSO READ: ప్రభాస్, గోపీచంద్ కాంబోలో మూవీ.. అసలు క్లారిటీ ఎంటీ?

ర్యాడిసన్‌ హోటల్‌ యాజమాన్యంపై కేసులు!

గోవాకు చెందిన అబ్దుల్‌ నుంచి డ్రగ్స్‌ నగరంలోని సప్లయర్‌ రెహమాన్‌కు చేరిందని, పలు ఎన్‌డీపీఎస్‌ కేసుల్లో రెహమాన్‌ నిందితుడిగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. గోవా, బెంగళూర్‌లో వీరికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. వీరు హైదరాబాద్‌లో మీర్జా యాప్ ద్వారా డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మీర్జా నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ర్యాడిసన్‌ హోటల్‌ యాజమాన్యంపై కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button