Mahesh Babu: ‘గుంటూరుకారం’ సినిమాపై ప్రముఖ సినీ రచయిత సంచలన వ్యాఖ్యలు
సూపర్ స్టార్ మహేశ్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇటీవల విడుదలైన చిత్రం ‘గుంటూరుకారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడులైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో నెలరోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ విఫలమయ్యారని, రొటీన్ కథ ద్వారా ప్రేక్షకులకు బోర్ కొట్టించారని విడుదలైన సందర్భంలో విమర్శలు వచ్చాయి.
ALSO READ: విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘గామి’ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
అయితే ఈ సినిమాపై ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. 350కి పైగా చిత్రాలకు పనిచేసిన తనకు ఈ సినిమా కథనం కన్ఫ్యూజన్గా అనిపించిందని, అసలు ఇది మహేశ్ ఎంచుకోవాల్సిన కథ కాదని అన్నారు. మూవీలో రమ్యకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్నే డెవలప్ చేసుకుంటూ వెళ్లి ఉంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ అయి ఉండేదని చెప్పారు. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల టైటిల్ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు. కానీ ఈ సినిమా టైటిల్ విషయంలోనూ త్రివిక్రమ్ పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. అసలు సినిమాకు ‘గుంటూరుకారం’ టైటిల్ సరిపోదని, ఒకవేళ సెంటిమెంట్ను ప్రధానంగా తీసుకొని పెట్టినా ‘గుంటూరు వారి అబ్బాయి’ అని పెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు.