Ramcharan: మైసూరు లో “గేమ్ ఛేంజర్”… చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రస్తుతం రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ మైసూరులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి ఆలయానికి చరణ్ వెళ్లారు. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: శ్రీలీలపై నితిన్ కామెంట్స్.. అలా అన్నాడేంటి?
నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు చరణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కు వచ్చారు. ఓటు వేసిన తర్వాత ఆయన మళ్లీ షూటింగ్ కోసం మైసూరుకు వెళ్లిపోయారు.గేమ్ ఛేంజర్ సినిమా ప్రకటించి రెండేళ్లు అవుతున్న కానీ ఇప్పటిదాకా సినిమా టైటిల్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో మెగా అభిమానులు నిరాశలో ఉన్నారు.
Also Read: జిమ్లో సూపర్స్టార్ ప్రిన్స్ కసరత్తు.. ఫొటోలు వైరల్
గేమ్ ఛేంజర్ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటించినా ఇంకా షూటింగ్ కూడా అవ్వకపోవడంతో సినిమా వాయిదాపడినట్టే అని అంతా ఫిక్స్ అయ్యారు. ఇన్ని రోజులు శంకర్ ఇండియన్ 2 సినిమాతో, చరణ్ పాప పుట్టడంతో బిజీగా ఉన్నారు. ఎప్పుడో ఆగిన గేమ్ ఛేంజర్ సినిమా షూట్ ఇటీవలే మళ్ళీ మొదలైంది. మైసూరులో ఈ సినిమా షూట్ గత వారం రోజులుగా శరవేగంగా జరుగుతుంది.
![](https://pakkatelugu.com/wp-content/uploads/2023/12/charan-1-768x1024.jpg)
![](https://pakkatelugu.com/wp-content/uploads/2023/12/charan-2-576x1024.jpg)
![](https://pakkatelugu.com/wp-content/uploads/2023/12/charan-3-576x1024.jpg)