AP Government: విశాఖలో మరో అంతర్జాతీయ క్రికెట్ మైదానం!
విశాఖపట్నంలో మరో అంతర్జాతీయ క్రికెట్ మైదానం అందుబాటులోకి రానుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకూ క్రికెట్కు ఆదరణ పెరుగుతుందని, ప్రస్తుతం విశాఖలో ఉన్న వైఎస్సార్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 27 వేల లోపు ఉండడంతో మరో ప్రపంచ స్థాయి స్టేడియాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.
ALSO READ: జనసేనానిపై క్రిమినల్ కేసు.. వాలంటీర్లపై వ్యాఖ్యలకు చర్యలు
50వేల సిట్టింగ్ సామర్థ్యం..
50వేల సిట్టింగ్ సామర్థ్యంతో నిర్మించనున్న ఈ స్టేడియానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. అదే విధంగా విశాఖ స్టేడియంలోని బి గ్రౌండ్లో ఇండోర్ స్టేడియం, ప్రతి జిల్లాలో ఏసీఏ క్రికెట్ మైదానాలను అభివృద్ధి చేయనున్నారు. అలాగే ప్రతి జోన్కు ఒక స్టేడియం నిర్మిస్తామని తెలిపింది. మార్చి నుంచి జరిగే ఐపీఎల్ మ్యాచ్లు కూడా విశాఖలో జరుగుతున్నాయని, త్వరలో 175 నియోజకవర్గాల్లో మెగా స్కూల్ క్రికెట్ లీగ్లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సుమారు 20 వేల మంది యువ క్రికెటర్లు వారి ప్రతిభను ప్రదర్శించేలా విధివిధానాలను రూపొందించనున్నట్లు పేర్కొంది.