తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్‌ కుమార్ ప్రసాద్

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే పెద్ద ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా ఉన్న జవహర్ రెడ్డిని ముందు సెలవుపై పంపించారు. ఆ తర్వాత ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వెంటనే కొత్త సీఎస్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ALSO READ: గూగుల్ మ్యాప్స్‌లో మరో సరికొత్త ఫీచర్

1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నీరభ్‌ కుమార్‌ ప్రసాద్ బుధవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అదే రోజు సీఎస్ జవహర్‌ రెడ్డి సైతం మర్యాదపూర్వకంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. జవహర్‌ రెడ్డిని కొనసాగించే ఉద్దేశం లేదని స్పష్టం కావడంతో బుధవారం ఆయన జీఏడీ కార్యదర్శికి సెలవుపై వెళుతున్నట్టు లేఖను పంపారు. దీంతో కొత్త సీఎస్ ఎంపికకు మార్గం సుగమం అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button