![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-12.55.44_1f7424dc.jpg)
AP Politics: వలంటీర్లపై మాట మార్చిన పవన్కల్యాణ్.. ఓట్ల కోసమేనా?
వలంటీర్లపై గతంలో జనసేన జనసేన అధినేత పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. మరోసారి వలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి మాట మార్చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలు వైసీపీ వలంటీర్ల వల్లే అదృశ్యమై పోయారని నేను అన్నానని ముఖ్యమంత్రి అంటున్నారు. నేను చెప్పింది మీ వలంటీర్లు సమాచారం సేకరించడంతో ఆ డేటా ఎటో వెళ్లి పోయిందని చెప్పాను. అంతే తప్పా.. ఏ రోజూ వలంటీర్లే అంతా చేశారని నేను అనలేదు. వాళ్ల మీద గౌరవం ఉంది. వలంటీర్ల వ్యవస్థను నేను తప్పు పట్టలేదు. వలంటీర్లుగా పని చేస్తున్న వారి భవిష్యత్ కోసం మేమందరం సంపూర్ణంగా పని చేస్తామని చెప్పుకొచ్చారు.
ALSO READ: మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
విద్రోహ శక్తులతో పోల్చిన నోటితోనే పొగడ్తలు
రాష్ట్రంలో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగుకు వలంటీర్లే కారణమని, ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని ఆ సమాచారాన్ని కొంత మంది విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్లు కిడ్నాప్, ట్రాప్ చేస్తున్నారు. దీంతో మహిళలు ఆదృశ్యమవుతున్నారు. నాతో సాక్షాత్తూ కేంద్ర నిఘా వర్గాలే ఈ మాటలు చెప్పాయని పవన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అదే విధంగా వలంటీర్ వ్యవస్థపై జనసేన కోర్టులో ఛాలెంజ్ చేస్తోందని, మనస్ఫూర్తిగా చెబుతున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, జనసేన అధికారంలోకి రాగానే వలంటీర్ వ్యవస్ధ నడుం విరగొడతాననని, విద్రోహ శక్తులతో పోల్చిన నోటితోనే జనసేనాని పొగడ్తలు వర్షం కురిపించారు.
ALSO READ: కాంగ్రెస్ గూటికి ఈటెల.. వార్తల్లో నిజమెంతా?
అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట
వలంటీర్లపై ఆరోపణలు చేయడంతో పార్టీకి డ్యామేజి జరగడం ఖాయమని భావించినా పవన్.. నేడు మాట మార్చినట్లు తెలుస్తోంది. మరోవైపు వలంటీర్ల ద్వారా జరుగుతున్న డ్యామేజీని కంట్రోల్ చేయడం కోసమే పవన్ మాట మార్చినట్లు అర్థమైపోతోంది. పవన్ కేవలం ఒక్క వలంటీర్లకు సంబంధించిన అంశంలోనే కాదు.. అనేక సందర్భాల్లో అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట మార్చుతూ తనకు చాలా నాలుకలున్నాయని రుజువు చేస్తున్నారు. అమరావతి రాజధాని, కాపు రిజర్వేషన్ల అంశంతోపాటు అనేక కీలక అంశాలన్నింటిలోనూ జనసేనాని రాజకీయ వైఖరి పూర్తి యూ టర్న్ అన్న రీతినే సాగుతోంది.