తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: త్వరలో టీడీపీ ఖాళీ.. కేశినేని ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీలో త్వరలోనే 60 శాతం వరకు ఖాళీ అవుతుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీలో చేరిన ఆయనకు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి ఖరారు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాలలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, అంతకుముందు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదిక ద్వారా కేశినేని నానిపై విమర్శలు కురిపించారు. ఈ విషయంపై కేశినేని స్పందిస్తూ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు.

ALSO READ: కళాకారులకు గుర్తింపు కార్డులు.. డప్పు వాయించిన రోజా

చంద్రబాబు, తన స్థాయి ఒక్కటే..

రాజకీయాల్లో తనది, చంద్రబాబు స్థాయి ఒక్కటేనని.. తన కంటే లోకేష్ స్థాయి చాలా తక్కువని కేశినేని నాని వెల్లడించారు. కాల్ మనీ కేటుగాళ్లు, సెక్స్ రాకెట్, అక్రమ వ్యాపారాలు చేసే వారి మాటలకు తాను స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అయితే రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశం తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరాలని అనుకున్నానని, కానీ సీఎం జగన్ పిలుపుతో వెంటనే వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వెల్లడించారు. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని, నాయకుల పాత్ర తక్కువ.. ప్రజల పాత్ర ఎక్కువ అని తెలిపారు. కావున వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కేశినేని నాని జోస్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button