Gajuwaka: వైసీపీకి బై బై.. జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో ఉన్నారు. ఎప్పటి నుంచో సీఎం జగన్, వైసీపీపై అసంతృప్తితో ఉన్న వంశీకృష్ణ ఎట్టకేలకు పార్టీని వీడారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో బుధవారం వంశీకృష్ణను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పి ఆహ్వానించారు. వంశీకృష్ణను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు.. అతడికి పార్టీలో తగిన గౌరవం ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Also Read బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తొలి జీతం ఎంతో తెలుసా?
చేరిక అనంతరం పవన్ మాట్లాడుతూ.. ‘వంశీతో 2009 నుంచే పరిచయం ఉంది. ప్రజారాజ్యం యువజన విభాగం అధ్యక్షుడిగా వంశీ పని చేశాడు. ఎమ్మెల్సీగా ఉండీ కూడా జనసేనలోకి వచ్చిన అతడిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా’ అని తెలిపాడు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ‘వైసీపీలో చేరకముందే నేను పవన్ కల్యాణ్ అభిమానిని. పవన్ ఆలోచనలు నచ్చి జనసేనలో చేరాను. సొంత పార్టీలోకి వచ్చాననే ఆనందం ఉంది. గతంలో నేను ప్రజారాజ్యంలో పని చేశా. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ తో కలిసి తిరిగాను. కొన్ని శక్తులు, కొన్ని కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది’ అని తెలిపారు.
Also Read రాహుల్ గాంధీ మరో యాత్ర.. 14 రాష్ట్రాలు.. 6,200 కిలోమీటర్లు
విశాఖపట్టణానికి చెందిన వంశీకృష్ణ గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ గా గెలుపొందారు. జీవీఎంసీ మేయర్ పదవి ఆశించగా సీఎం జగన్ అంగీకరించలేదు. ఏడాది తర్వాత స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా వంశీకృష్ణ ఎన్నికయ్యాడు. గాజువాక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తుండగా వైసీపీ అధిష్టానం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో పార్టీపై అసంతృప్తితో పెంచుకున్న వంశీకృష్ణ జనసేన చెంతకు చేరారు. గతంలో పవన్ పోటీ చేసిన గాజువాక సీటుపై వంశీకృష్ణ కన్నేశాడు. జనసేన తరఫున గాజువాక టికెట్ ఖరారు చేసుకున్న అనంతరమే వంశీకృష్ణ కండువా మార్చేశారు.