Purandeswari: కేంద్ర పథకాలకు… రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు.. పురందేశ్వరి ఎద్దేవా
కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమండ్రిలో మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ హాస్పిటల్, మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మిస్తుంది కేంద్ర ప్రభుత్వమేనని తెలిపారు. కేంద్రం జలజీవన్ మిషన్ కింద 6000 కుళాయి కనెక్షన్లు ఇచ్చిందన్నారు. టూరిజం అబివృద్ధి కోసం రాజమండ్రి నుంచి లంబసింగి హైవే వేస్తున్నామన్నారు.
Also Read: మంగళగిరిలో లోకేష్ పర్యటన… భవిష్యత్ కార్యచరణపై చర్చ
కేంద్రం ఇచ్చిన డబ్బులను జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పంచుతున్నారని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నమైన స్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులను ధ్వంసం చేస్తున్నారని పురందేశ్వరి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చవద్దని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర నాయకత్వం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని ఆమె స్ఫష్టంచేశారు.