Tirumala: శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్ కార్యాచరణ: చంద్రబాబు
అలిపిరి దాడి ఘటనలో తిరుమల వేంకటేశ్వర స్వామినే కాపాడారని.. ఇప్పుడు ఆ స్వామి ఆశీస్సులతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం తెల్లవారుజామున చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శించుకున్నారు.
Also Read: సర్వేలన్నీ కాంగ్రెస్ కే పట్టం.. 9న సర్వం సిద్ధం
దర్శనాంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారే కాపాడారు. త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తా. ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నా. కష్టం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకున్నా. ధర్మాన్ని కాపాడాలని ప్రార్థించాను. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి. తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉండాలని కోరుకున్నా’ అని తెలిపారు.
Also Read: పోల్ స్ట్రాటేజీ గ్రూప్ ఎగ్జిట్ ఫలితాలు ఇవే.. మిగతావి
రాజకీయాలపై పూర్తి దృష్టి
నైపుణ్య అభివృద్ధి కుంభకోణం కేసులో జైలుకు వెళ్లిన చంద్రబాబు బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. హైకోర్టు, సుప్రీంకోర్టు బెయిల్ నిబంధనలు సడలించడంతో చంద్రబాబు రాజకీయాలపై దృష్టి సారించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకువస్తుండడంతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని ప్రముఖ ఆలయాల సందర్శన చేపట్టారు. త్వరలోనే ఈ యాత్రలు ముగించి రాజకీయాలపై పూర్తి దృష్టి సారిస్తారు.