తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YCP: వైసీపీ తొమ్మిదో జాబితా విడుదల.. ప్రత్యక్ష ఎన్నికల్లోకి విజయసాయిరెడ్డి!

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ముందు నుంచి ఆచితూచి వ్యవహరిస్తున్న అధినేత జగన్ నిన్న తొమ్మిదో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు.

ALSO READ: జనసేన పార్టీకి బీటలు.. పార్టీని వీడిన మరోనేత

వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించారు. దీంతో ఆయన రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడి (2016, 2022)గా ఉన్న విజయసాయి రెడ్డి.. ఈ ఎన్నికల్లో నిలబడితే మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నట్లువుతుంది. ఇక, మంగళగిరి స్థానంలో ఇదివరకు నియమించిన గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్యను నియమించారు. కర్నూలు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ ఇంతియాజ్‌ను నియమించారు. ఈయన ఐఏఎస్‌గా వీఆర్‌ఎస్‌ తీసుకుని ఇటీవలే పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button