తెలుగు
te తెలుగు en English
జాతీయం

BJP: సార్వత్రిక ఎన్నికలు.. బీజేపీ కొత్త వ్యూహం

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బీజేపీ మళ్లీ అధికారం చేపట్టేలా వ్యూహాలు రచిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని సీనియర్ నేతలను కోరినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రెండు రోజుల మేధోమథనం సమావేశం ముగింపు రోజున శనివారం బీజేపీ జాతీయ పదాధికారులు, రాష్ట్ర అధ్యక్షులను ఉద్దేశించి హోం మంత్రి అమిత్ షా కీలక సూచనలు చేశారట. వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లను సాధించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారట. దీనికోసం జనవరి 15 నుంచి క్లస్టర్ సమావేశాలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లోక్ సభలను క్లస్టర్లుగా విభజించి, సమావేశాలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు. క్లస్టర్ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించేలా ప్లాన్‌ చేయనున్నారు.

Also read: AICC: సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ గురి.. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా పి. చిదంబరం

ఇక యువమోర్చా అధ్వర్యంలో దేశవ్యాప్తంగా 5000 సదస్సులు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. కొత్త ఓటర్లతో మమైకమయ్యేందుకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. జనవరి 24 నుంచి యువమోర్చా అధ్వర్యంలో కొత్త ఓటరు సదస్సులు పెట్టబోతున్నారు. ప్రతి బీజేపీ నాయకుడు లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించాలని ప్రధాని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. అలాగే జనవరి 1 నుండి రామమందిర ఉత్సవాల ప్రచారం నిర్వహించబోతున్నారు. బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి పది కోట్ల కుటుంబాలను రామ మందిరానికి దియా మెరుపు కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి పోరాడాలని సిద్దమవుతుండగా.. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకును ఇంకా పెంచాలని ప్రధాని మోడీ సూచించారు. అయితే, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ దాదాపు 45 శాతం ఓట్లను సాధించింది. 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని 50 శాతానికి పెంచుకునేందుకు కృషి చేస్తోంది.

ప్రతిపక్షాలకు సవాలు చేసేలా వచ్చే ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించాలని సూచించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహిళలు, యువత, రైతులు, పేదలకు చేరువ కావాల్సిన అవసరాన్ని ప్రధాని వివరించారు. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సంతృప్తే లక్ష్యంగా ‘విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర’తో గరిష్ట సంఖ్యలో ఓటర్లను కనెక్ట్ చేయాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. ప్రతిపక్షాలు అబద్ధాలను ఆశ్రయిస్తున్నాయని, బూటకపు కథనాలను ప్రచారం చేస్తున్నాయని వారు ఆరోపించారు. కానీ ప్రజలు మూడోసారి కూడా బీజేపీకి పట్టం కట్టనున్నారని వెల్లడించారు. పార్టీ అగ్ర నాయకులు, తమ ప్రసంగాలలో, బీజేపీ కార్యకర్తలను తమ స్థానిక కార్యకర్తలు మరింత ఎక్కువ మంది ప్రజలకు చేరేలా చూసేందుకు ప్రతిచోటా బూత్ కమిటీలను బలోపేతం చేయాలని కోరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ సాధించిన భారీ విజయాలపై సమావేశంలో ప్రశంసలు కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button