తెలుగు
te తెలుగు en English
జాతీయం

BJP: అభ్యర్థుల జాబితాపై బీజేపీ కసరత్తు.. తెలంగాణ అభ్యర్థుల ఖరారు?

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తోంది. తొలి విడతలో 100 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖారారు చేసినట్లు, త్వరలోనే జాబితా విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఉత్తరాదితో పాటు.. దక్షిణాదిలోని తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో గురువారం అమిత్ షా, జేపీ నడ్డా రాజ్ నాథ్ సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Also read: BRS: బీఆర్ఎస్ నేతల ఛలో మేడిగడ్డ.. అయ్యో.. పేలిన బస్సు టైరు

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల ఎంపీ స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన బలహీన స్థానాలతో పాటు, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు కూడా తొలిజాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయం ప్రాంతీయ పార్టీల పొత్తుల కారణంగా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో అకాలీదళ్, అన్నాడీఎంకేతో తిరిగి సంబంధాలను పునరుద్ధరించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

రాజ్యసభలో ఎంపీలుగా ఉన్న పలువురు కేంద్రమంత్రులు ఈసారి లోక్ సభ బరిలో దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, ఏవియోషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింథియా, కేంద్ర సహాయమంత్రి వీ మురళీధరన్ ఈసారి బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ మరోసారి వారణాసి నుంచి అమిత్ షా గాంధీనగర్, రాజ్ నాథ్ సింగ్ లక్నో నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ గుణ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ నుంచి తృణముల్ తరుపున ఎంపీగా ఉన్న శత్రఘ్ను సిన్హాకు పోటీగా బీజేపీ భోజ్ పురి స్టార్ పవన్ సింగ్ ని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button