తెలుగు
te తెలుగు en English
జాతీయం

EC: ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు?.. ఈసీ క్లారిటీ

భారత్‌లో ఎన్నికల వాతావరణం మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించలేదు. అయితే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందనే తప్పుడు వార్తను ఈసీ ఖండించింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని ఈసీ తెలిపింది. అందులో ఫిబ్రవరి 16న ఎలక్షన్ కోడ్ రాబోతుందని.. మార్చ్ 16 నాటికి టిక్కెట్ల పంపిణీతో పాటు ఏప్రిల్ 16న తుది ఎన్నికలు జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై ఈసీఐ మాట్లాడుతూ.. ఆ మెస్సేజ్ నకిలీది.. తేదీలను ఎలక్షన్ కమిషన్ ఇంకా ప్రకటించలేదని పేర్కొంది.

Also read: Chandrababu: నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ

దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికలకు గరిష్టంగా 125 రోజులు మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల తేదీలు ప్రకటించకముందే రాజకీయ పార్టీలు సన్నాహాలను ముమ్మరం చేశాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) 400 సీట్లకు పైగా గెలుస్తుందని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. ఇక, బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి సిద్ధమైంది. తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎంతో దూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్డీయే కూటమి 400 సీట్లు దాటే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button