తెలుగు
te తెలుగు en English
జాతీయం

ECI: ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన.. వచ్చే నెలలో నోటిఫికేషన్?

పార్లమెంట్, అలాగే ఆయా రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ చెప్పుకొచ్చారు.

Also read: CM Revanth: కాళేశ్వరం పాపం వారిదే.. సీఎం రేవంత్ ఫైర్

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 50% పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. 22,685 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 300 పోలింగ్ స్టేషన్లు వికలాంగుల కోసం ఏర్పాటు చేసినట్లు రాజీవ్ కుమార్ చెప్పుకొచ్చారు. అయితే వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి మే నెలలో రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఓ వైపు ఎన్డీఏ.. ఇంకోవైపు ఇండియా కూటమి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో 400 సీట్లు గెలుపొందడం కోసం ఏం చేయాలన్నదానిపై ఢిల్లీలో మేథోమదనం చేస్తున్నారు. ఇంకోవైపు విపక్ష పార్టీలు కూడా ఇండియా కూటమిగా ఏర్పడ్డారు. కానీ.. వారిలో ఐక్యత లోపించింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీలు కూటమిలో ఉన్న కూడా సొంతంగా బరిలోకి దిగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button