![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/03/177486-b.jpg)
Elections: మరోసారి వారణాసి నుంచే ప్రధాని మోదీ పోటీ.. బీజేపీ తొలి జాబితా రిలీజ్
దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహాలం మొదలైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా లోక్సభ అభ్యర్థుల బీజేపీ తొలి జాబితా విడుదలైంది. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన సమావేశం అనంతరం బీజేపీ తొలి జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే, అర్జున్ పాండులు విడుదల చేశారు. ఈ జాబితాలో 28మంది మహిళలకు అవకాశం కల్పించగా, యువతకు 47, ఎస్సీలు 27, ఎస్టీలు 18, ఓబీసీలకు 57 స్థానాలు కేటాయించారు. అదే విధంగా కేంద్ర మంత్రులు 34 మంది కాగా, తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ALSO READ: ఒంటరిగానే బరిలోకి దిగనున్న బీజేపీ?
195 సీట్లతో తొలి జాబితా..
195 సీట్లతో తొలి జాబితా ప్రకటించిన వినోద్ తావడే.. వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోదీ పోటీచేస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి ఎన్డీఏ కూటమిలో 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పారు. బీజేపీ 300కుపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి 9మంది వీళ్లే..
ఇప్పటివరకు బీజేపీ తొలి జాబితాపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాజాగా, విడుదల చేసిన ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9మందికి బీజేపీ చోటు దక్కింది.
కరీంనగర్ – బండి సంజయ్
నిజామాబాద్ – ధర్మపురి అరవింద్
మల్కాజ్ గిరి – ఈటల రాజేందర్
భువనగిరి – బూర నర్సయ్య గౌడ్
సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
హైదరాబాద్ – మాధవీలత
చేవేళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నాగర్ కర్నూల్ – పి.భరత్
జహీరాబాద్ – బీబీ పాటిల్
One Comment