తెలుగు
te తెలుగు en English
జాతీయం

Himachal Pradesh: రసకందాయంలో హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు.. కోర్టు మెట్లెక్కిన రెబల్ ఎమ్మెల్యేలు

హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్‌ సింగ్ పథానియా వారిని ఎమ్మెల్యేల సభ్యత్వాల నుంచి తొలగించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు.

Also read: Gruha Jyothi: నేటి నుంచి ఉచిత విద్యుత్.. జీరో బిల్లుల జారీ షురూ

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్ లఖన్‌పాల్, చెతన్య శర్మ, దేవిందర్ కుమార్ భుట్టో క్రాస్‌ ఓటింగ్‌ వేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, బీజేపీ అభ్యర్థికి సరిసమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో టాస్‌ వేయగా బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. ఈ అనర్హత వేటు వలన హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ బలం 40 నుండి 34కి తగ్గింది. ప్రతిపక్ష బీజేపీకి ఇప్పుడు 25 సీట్లు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button