తెలుగు
te తెలుగు en English
జాతీయం

PM Modi: మోడీ పర్యటన… అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. రామాలయం ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పునర్నిర్మించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ను మోదీ ప్రారంభించారు. అనంతరం రెండు అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఇదే వేదిక నుంచి ఆరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రధాని ప్రారంభించారు.

Also Read: అదంతా తప్పు.. నేను రాజీనామా చేయడం లేదు: గవర్నర్ తమిళిసై

అయోధ్యలో అడుగుపెట్టిన ప్రధానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన 1,400 మంది కళాకారులు తమ ప్రదర్శనతో స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి అయోధ్య ధామ్ వరకు ఏర్పాటు చేసిన 40 స్టేజీలపై కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

Also Read: ప్రజాపాలనపై సీఎం సమీక్ష.. రైతుబంధు, పింఛన్లపై ప్రకటన

శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు కట్టడాలను సుందరంగా నిర్మించారు. శిఖరం, విల్లు బాణం వంటివి శ్రీరాముడిని గుర్తుకు తెస్తున్నాయి. నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్‌ విస్తరించి ఉంది. ఈ స్టేషన్‌ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్‌ ఇండియా టెక్నికల్, ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌(రైట్స్‌) అభివృద్ధి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button