![](https://pakkatelugu.com/wp-content/uploads/2023/10/pm-modi.webp)
PM Modi: తెలంగాణ ఎన్నికల ఫలితాలు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుకున్నంత స్థానాలను కైవసం చేసుకోలేదు. ముఖ్యంగా కీలక నేతలు.. ఈ ఎన్నికల్లో గెలువకపోవడం పెద్దదెబ్బ అనే చెప్పాలి. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఇంకొందరు ముఖ్యనేతలు పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Also read: Telangana Assembly Elections: మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు.. ఎవరంటే?
తెలంగాణతో తమ బంధం విడదీయరానిది.. రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ పని చేస్తూనే ఉంటుందని ప్రధాని తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిందని అన్నారు. కాగా.. బీజేపీ మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం పెరుగుతోందని, దానిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తూనే ఉంటామని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
“నా ప్రియమైన తెలంగాణ సోదరీమణులు, సోదరులారా.. @BJP4ఇండియాకు మీ మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా, ఈ మద్దతు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ధోరణి కొనసాగుతుంది” అని ప్రధాని పోస్ట్ చేశారు. “తెలంగాణతో మా బంధం విడదీయరానిది, మేము ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాము. ప్రతి బీజేపీ కార్యకర్త కృషిని నేను అభినందిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తెలిపారు.