Rahul Gandhi: కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన.. సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీ
భారత రెజ్లర్లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు. హర్యానాలోని బహదూర్ఘర్లోని ఛరా గ్రామంలో ఆయన రెజ్లర్లను కలసి సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ కు బజరంగ్ పునియా వారి సమస్యలను తెలిపారు. అనంతరం వారిని ఓదార్చిన రాహుల్.. దేశమంతా రెజ్లర్లకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Also read: AP Government: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం..ఏపీ బాటలోనే!
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ప్రెసిడెంట్గా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎంపికయ్యారు. ఇది రెజ్లర్లను తీవ్ర నిరాశకు గురిచేసేందని.. సంజయ్ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. బజ్రంగ్ పునియా, వీరేందర్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను వాపస్ చేశారు. ఖేల్రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వినేశ్ ఫొగాట్ ప్రకటించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వారికి మద్దతు తెలిపారు.