తెలుగు
te తెలుగు en English
జాతీయం

SP: అత్యంత వృద్ధ ఎంపీ షఫికర్‌ రహ్మాన్‌ బర్క్‌ మృతి

సమాజ్‌వాదీ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు షఫికర్‌ రహ్మాన్‌ బర్క్‌ (93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో గల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.

ALSO READ: స్పీకర్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

యూపీలోని సంభల్ నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న షఫికర్‌ రహ్మాన్‌ బర్క్‌ ప్రస్తుత పార్లమెంట్‌లో అత్యంత వృద్ధ ఎంపీగా రికార్డు సృష్టించారు. సంభల్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మొరాదాబాద్‌ నుంచి మూడుసార్లు ఎంపీగా, సంభల్‌ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొంది రాజకీయాల్లో అపార అనుభవం ఘడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ సంభల్ నుంచే బర్క్‌ను బరిలో దించాలని ఎస్పీ ఇటీవలే నిర్ణయించింది. కానీ ఇంతలోనే విషాదం నెలకొంది. కాగా.. షఫికర్‌ గతంలో ‘వందేమాతరం’ నినాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. అనంతరం తాలిబన్లను స్వాతంత్య్ర సమరయోధులతో పోల్చి మరోసారి వివాదాల్లోకెక్కారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button