తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Assembly: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ… ప్రమాణ స్వీకారం చేయనన్న రాజాసింగ్

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు రేపు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు మజ్లిస్ పార్టీ నుంచి గెలిచిన అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా రాజభవన్‌లో ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించి… స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి.

Also Read: తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే

ఆరుసార్లు గెలిచిన అక్బరుద్దీన్

సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ప్రస్తుతం కేసీఆర్ అత్యధికంగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అక్బరుద్దీన్ ఆరుసార్లు గెలిచారు. కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారు.

Also Read: రెండు రాష్ట్రాలలో ఉద్యోగాల భర్తీ… జగనే టాప్

ప్రమాణ స్వీకారం చేయనన్న రాజాసింగ్

ఈ నేపథ్యంలోనే ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసేది లేదని గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ స్పష్టం చేశారు. అసెంబ్లీకి పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాకే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు. 2018లోనూ రాజాసింగ్… ప్రొటెం స్పీకర్‌‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్‌ ఖాన్‌ వ్యవహరించినప్పుడు ఇలాగే ప్రకటించారు. ఆ తర్వాత అసెంబ్లీకి పూర్తిస్థాయి స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వచ్చాకే ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button