Assembly ELections-2023: కొత్త కొత్తగా.. ఐదు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులు
ఐదు రాష్ట్రాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతోపాటు కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. తెలంగాణతోపాటు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా.. మధ్యప్రదేశ్లో మినహా అన్ని చోట్ల ప్రభుత్వాలు మారాయి. ఇక మూడు రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్లలో బీజేపీ విజయ దుందుభి మోగించగా.. తెలంగాణలో కాంగ్రెస్, మిజోరంలో జెడ్పీఎం గెలుపొందాయి.
ALSO READ: ప్రమాణ స్వీకారం బీజేపీ ఎమ్మెల్యేలు.. మనసులో మాట చెప్పిన రాజాసింగ్
సీనియర్లు ఉన్నా.. కొత్తవారికే ఛాన్స్
తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా.. బీజేపీ కైవసం చేసుకున్న రాజస్థాన్లో భజన్ లాల్, మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్, చత్తీస్ గఢ్లో విష్ణుదేవ్ ఎన్నికయ్యారు. ఇక మిజోరాం విషయానికొస్తే.. ఈ రాష్ట్రంలో గెలుపొందిన జెడ్పీఎంకి చెందిన లాల్దుహోమా ఎన్నికయ్యారు. అయితే బీజేపీ మూడు చోట్ల సీనియర్లను కాదని కొత్త వారిని కాషాయ పార్టీ ఎంచుకున్న తీరు ఆశ్చర్యాన్నీ, ఆలోచననూ కలిగిస్తోంది. మరోవైపు తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో కూడా కొత్తవారు సీఎంగా బాధ్యతలు నిర్వహించడం గమనార్హం. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు రానున్న వేళ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.