Bandi Sanjay: ‘సామాజిక అధికార శిబిరం’…. 18 రకాల ఉపకరణాలు పంపిణీ
దివ్యాంగులు, మహిళలు, వృద్దులు, పిల్లల కోసం గత మూడేళ్లలో కేంద్రం 100 కోట్లు ఖర్చు చేసిందని ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ఉపకరణాలు రానివాళ్లు బాధపడాల్సిన పనిలేదని, మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వారందరికీ త్వరలోనే ఉప కరణాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ‘సామాజిక అధికార శిబిరం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో… దివ్యాంగులకు ట్రై సైకిల్స్, చేతి కర్రలు, వినికిడి యంత్రాలు సహా 18 రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు.
Also Read: అంగన్ వాడీల ఆందోళన… అరెస్ట్ చేసిన పోలీసులు
బీఆర్ఎస్ పాలనలో నిర్బంధాల మధ్య అధికారులు పనిచేశారని, ఇప్పుడు అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా అధికారులకు స్వేచ్ఛ ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి నిధులన్నీ మోదీ సర్కార్ ఇచ్చినవే అని తెలిపారు.
Also Read: మాజీ సీఎం కేసీఆర్ నిర్వాకం…వీటినే సంపద అంటారా?
కేరళకు అయ్యప్ప భక్తులు వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించారు. అయ్యప్ప భక్తుల ఇబ్బందులు పాలకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. తబ్లీగీ జమాత్ను ఇస్లామిక్ దేశాలు నిషేధించాయని… ఆ సంస్థని రాష్ట్రానికి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. తిరుపతిలో పులులు వస్తే భక్తులకు కర్రలు ఇస్తారా అని ఎద్దేవా చేశారు. తిరుమలకు భక్తులు రాకుండా కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.