తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BJP: గల్లీలో ఎవరున్నా… ఢిల్లీలో బీజేపీ ఉండాలి: బండి సంజయ్

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో జరిగిన నవ యువ ఓటర్ల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల కోసం నిర్విరామ పోరాటం చేసిన తనపై కేసీఆర్ ప్రభుత్వం వందకు పైగా కేసులు పెట్టిందని ఆవేదన చెందారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో మాత్రం బీజేపీ ప్రభుత్వమే ఉండాలని ఆకాంక్షించారు.

Also Read: కేటీఆర్ కోసం క్యూ కట్టిన గులాబీ నేతలు.. కారణం అదేనా?

దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. మోడీ లేని భారత్‌ను ఊహించుకోలేమని, దేశ చరిత్రను మార్చే పనులన్నీ ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసం నేటి యువత పూర్తిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాస్ పోర్టు కంటే విలువైన వజ్రాయుధం ఓటు-ఓటు హక్కుతో తలరాతతోపాటు దేశ భవిష్యత్తును కూడా మార్చుకునే సత్తా ఉందన్నారు. కానీ నేటి యువత ఆశించిన స్థాయిలో ఓటు హక్కు నమోదు చేసుకోకపోవడం బాధాకరమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button