తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS: తెలంగాణలో సాగుతున్న ఓట్ల లెక్కింపు.. మంత్రులు వెనుకంజ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉ. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. 119 నియోజకవర్గాలకు గాను.. కాంగ్రెస్ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. అధికార బీఆర్ఎస్ 39 స్థానాలు, బీజేపీ 11 ఎంఐఎం 3, సీపీఐ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Also read: Bandla Ganesh: బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు.. రెడీ అవుతున్నానని వెల్లడి

ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం చూపిస్తుండగా.. రంగారెడ్డి, దక్షిణ తెలంగాణ జిల్లాలో బీఆర్ఎస్ ముందంజలో కనిపిస్తోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ హవా కనిపిస్తోంది. ఎన్నికల లెక్కింపులో పలువురు మంత్రులు ఫలితాల్లో వెనుకబడిపోయారు. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి, బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నిర్మల్ ఇంద్రకరణ్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button