తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్రమంత్రి అమిత్ షా.. టూర్ షెడ్యూల్ ఇదే!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేటి హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఫలితాలు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, అయోధ్యలో రామమందిరం జీవ ప్రతిష్ఠ తదితర అంశాలపై రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా చేరుకుంటారు. పార్లమెంట్ ఎన్నికలపై కమలనాథులకు దిశానిర్దేశం చేయనున్నారు.

మధ్యాహ్నం 1.25 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ కు వెళ్లనున్నారు. మధ్నాహ్నం 1.40 నుంచి 2.40 వరకు నోవాటెల్ హోటల్లో బీజేపీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. అనంతరం తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితిలపై రాష్ట్రనేతలతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 3.05 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయనికి వెళ్లి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

Also read: YS Sharmila: కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిల.. ముహూర్తం ఖరారు!

భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి 3.50 గంటలకు కొంగరకలాన్ శ్లోక కన్వెన్షన్ కు అమిత్ షా చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.50 నుంచి సాయంత్రం 5.20 వరకు బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. ఈ సమావేశంలో మండల, ఆ పై స్థాయి నాయకులతో మొదటి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్రనేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

అనంతరం 5.40 కి నోవోటల్ చేరుకోనున్నారు. హోటల్ లో బీజేపీ నేతలతో సాయంత్రం 5.50 నుండి 6.10 వరకు మొదటి మీటింగ్, సాయంత్రం 6.10 నుండి 6.40 వరకు మరో మీటింగ్ లో పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. కానీ.. ఈ మీటింగ్ లో ఎవరు పాల్గొంటారనేది బీజేపీ కార్యకర్తలు గోప్యంగా ఉంచారు. కాగా.. సాయంత్రం 6.50 గంటకులకు తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button