తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth: రూ. 2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని అన్నారు. ఇందుకు రేషన్‌ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. రూ.2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామన్నారు. ‘రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతాం. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు రోజుల తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలుంటాయి. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పాం. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలతో బడ్జెట్ ఉండకూడని అధికారులను ఆదేశాలు ఇచ్చాం.’ అని పేర్కొన్నారు.

ALSO READ: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు చెక్ చేసుకోండిలా!

అంతేకాదు, ఈ సమావేశంలో సీఎం రేవంత్ ఉచిత బస్సు పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగిందన్నారు. ఆర్టీసీకి ప్రతి నెలా రూ.350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. 30 శాతం నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెరిగింది. తద్వారా ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయి. గత అప్పులతో సంబంధం లేకుండా చుస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలతో ఆర్టీసీ నడుస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button