Congress: తెలంగాణలో కాంగ్రెస్ జోరు.. ఉమ్మడి ఖమ్మంలో బోణీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. 119 నియోజకవర్గాలకు గాను 64 స్థానాలు, బీఆర్ఎస్ 40, బీజేపీ 9, ఎంఐఎం 4, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Also read: BRS: తెలంగాణలో సాగుతున్న ఓట్ల లెక్కింపు.. మంత్రులు వెనుకంజ
ఇక తాజాగా ఉమ్మజి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. అశ్వారావుపేట కాంగ్రెస్ అభ్యర్థి జారె ఆదినారాయణ.. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుపై విజయం, మరోవైపు ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య.. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ నాయక్ పై విజయం సాధించారు. దీంతో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టింది. ఇక ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకునేలా ట్రెండ్స్ నడుస్తున్నాయి. ఖమ్మంలో తుమ్మల, పాలేరు పొంగులేటి, పినపాకలో పాయం, సత్తుపల్లి రాగమయి, మధిరలో భట్టి, భద్రాచలంలో పొదెం వీరయ్య, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, వైరాలో కూడా హస్తం హవా నడుస్తోంది.