తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: ఎన్నికల్లో అన్నదమ్ముల సత్తా.. అధికార పార్టీకి ఝలక్

కాంగ్రెస్ తెలంగాణలో విజయదుందుభి మోగించింది. 119 అసెంబ్లీల్లో 65 స్థానాల్లో కాంగ్రెస్ 27 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. 37 మంది విజయం సాధించారు. అధికార బీఆర్ఎస్ పార్టీ హస్తం ధాటికి నిలబడలేకుండా పోయింది.

ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీలో ఉన్న అన్నదమ్ముల ద్వయం మాత్రం గెలిచారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి నుంచి దివంగత కాంగ్రెస్ నేత వెంటకస్వామి కుమారులు గడ్డం వినోద్, వివేక్ గెలుపొందారు. బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ గెలుపొందగా.. చెన్నూర్ నుంచి వివేక్ గెలుపొందారు. వీరిద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులైన దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్‌ను ఓడించారు.

Read Also: Chandrababu: తెలంగాణలో హస్తం హవా.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచన

ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ సత్తా చాటారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిని ఓడించారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button