![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/kcr.jpeg)
KCR: బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్ధేశం… పోరాడాల్సింది మనమే అంటూ సూచన
తాను త్వరలో ప్రజల్లోకి వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల చివరలో ప్రారంభమై వారం రోజులపాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు.
Also Read: వైసిపి ఎన్నికల శంఖారావం.. భీమిలిలో నేడు వైఎస్ జగన్ ‘సిద్ధం’ బహిరంగ సభ
నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. కాగా నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో, పార్లమెంటు ఉభయ సభల్లో, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించాల్సిన విధానాలపై పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.