తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KTR: కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలు… కేటీఆర్ X లో కౌంటర్

తెలంగాణలో ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అన్ని హామీలను నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇలాంటి హామీలతోనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాజాగా కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి.

Also Read: లోక్ సభ ఎన్నికల పై కాంగ్రెస్ దృష్టి… 17 స్థానాలకు ఇంఛార్జుల నియామకం

“ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో అన్నాం అనుకోండి, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం,అంత మాత్రాన అన్నీ ఫ్రీ గా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది, అయితే డబ్బులు లేవని” కర్నాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: 1000 ఎకరాలు గుర్తించండి… అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం

దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నికల్లో ప్రజలను సక్సెస్ ఫుల్ గా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని… తెలంగాణ భవిష్యత్తు కూడా ఇదేనా? అని ప్రశ్నించారు. భారీ ప్రకటనలు చేసే ముందు కనీస అధ్యయనం, ప్లానింగ్ చేయాల్సిన అవసరం లేదా? అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button