తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ నిర్వాకం…వీటినే సంపద అంటారా?

బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి చెబుతున్న విషయం. అయితే ఇందుకు విరుద్దంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అప్పుల కంటే ఆస్తులను సృష్టించమని చెబుతుంది. ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అప్పులపై శ్వేత ప్రతం విడుదల చేస్తే కేటీఆర్ స్వేద పత్రాన్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే మూడోసారి ముఖ్యమంత్రి అవుతాననుకుని కేసీఆర్.. ముందుగానే 22 కొత్త ల్యాండ్ క్రూజర్ల వాహనాలు కొన్నారని చెప్పారు. ఇలాంటి వాటిని ప్రభుత్వ ఆస్తులు అంటారా..? అని ప్రశ్నించారు.

Also Read: నిరుద్యోగులకు తీపికబురు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

సీఎం రేవంత్ ఏమన్నారంటే..?

సీఎం హోదాలో తను ఉన్న కొత్త బండ్లు కొనవద్దని అనవసర ఖర్చు పెట్టద్దని పాత బండ్లనే రిపేర్ చేసి అడ్జెస్ట్ చేయండని అధికారులకు చెప్పినట్లు రేవంత్ పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం మాత్రమే తాను మూడో సారి కూడా సీఎం అవుతాననే ఉద్దేశంతో ముందుగానే 22 కొత్త ల్యాండ్ క్రూజర్ల ను కొని విజయవాడలో దాచుకున్నారని తెలిపారు. తనకే సీఎం అయిన తర్వాత 10 రోజులకు తెలిసిందని ఓ అధికారి చెప్పడని వివరించారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే మళ్లీ తీసుకొద్దామని అనుకున్నామని… కేసీఆర్ నెత్తిమీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయిండని సదరు అధికారి తనతో చెప్పాడని సీఎం తెలిపారు.

Also Read:  కేంద్ర పథకాలకు… రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు.. పురందేశ్వరి ఎద్దేవా

అసలు ఇన్ని వందల వాహనాలు ఉన్నప్పుడు కొత్తవి అవసరమా..? అని ప్రశ్నించారు. ఒక బండికి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే.. ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. ఇలాంటివి కేసీఆర్ సృష్టించిన సంపద అని చెప్పారు. 22 కొత్త ల్యాండ్ క్రూజర్ల వాహనాలు ప్రభుత్వ ఆస్తి.. తప్పనిసరిగా వాటిని తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button