తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

SSC: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు చెక్ చేసుకోండిలా!

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 51,272 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 46,731 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 34,126 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణత 73.03 శాతమని అధికారులు తెలిపారు.

ALSO READ: ఢిల్లీని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు!

బాలుర ఉత్తీర్ణత శాతం 71.01 కాగా.. 76.37 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు, బాలుర కంటే 5.36 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా అన్ని జిల్లాల కంటే 100 శాతము ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో ఉంది. అదే విధంగా రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ ఉత్తీర్ణత శాతం అనగా 42.14 సాధించి చివరి స్థానములో ఉంది. https://results.bsetelangana.org/ వెబ్‌సైట్ లో ఫలితాలు చూసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button